Posts

శ్రీ పద్మనాభస్వామి

 శ్రీ పద్మనాభస్వామి దేవాలయం               పద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలవాడు అని అర్థం. శ్రీ పద్మనాభస్వామి దేవాలయం శ్రీ మహా విష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంత పురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ట్రావెం కోర్ (travancore) రాజ కుటుంబం ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది. చరిత్ర :-                         ట్రావెన్ కోర్ రాజ కుటుంబం చేర వంశానికి చెందిన వారు. అలాగే కుల శేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీ మహా విష్ణువు యొక్క 108 దివ్య దేశములలో ఒకటి. 108 దివ్య దేశములు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలు అని అర్థం. శ్రీ మత్భాగవతంలో బలరామ దేవుడు తన తీర్థ యాత్రలో భాగంగా ఫాల్గుణ (ప్రస్తుత శ్రీ పద్మనాభస్వామి దేవాలయం) అనే ఈ దేవాలయాన్ని దర్శించి నట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మ తీర్థం లో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్య ప్రభందం లో కూడా ఈ ఆలయం ప్రస్తుతించారు. (6...

రెడ్డి రాజులు

 రెడ్డి రాజులు రెడ్డి రాజ్య వ్యవస్థాపకుడు, హరవీర భయంకరుడు, రెడ్డి రాజులలో అగ్రగణ్యుడు, గొరిల్లా యుద్ద కళ రూపకర్త అయిన ప్రోలయ వేమారెడ్డి గురించి తెలుసు కుందాం.               ఈయన కాకతీయ ప్రతాపరుద్రుడి సామంత రాజులు అయిన 72 సామంత రాజులలో ఒకడు. ప్రతాప రుద్రున్ని ఢిల్లీ సుల్తాన్ భందించిన తర్వాత సామంత రాజులందరూ ఢిల్లీ సుల్తానుకు సామంత రాజులు గా మారిపోయారు. కానీ అందులో ముగ్గురు మాత్రం స్వాతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. వారిలో ప్రోలయ వేమారెడ్డి ఒకడు. ఈయన కాక ముసునూరు కాపనాయకులు, హోయాలుల రాజైన మూడవ వీర బల్లాలుడు కూడా ఉన్నాడు. ఆ విధంగా 1323 ప్రాంతంలో కొండవీడు రాజధానిగా స్వాతంత్ర రెడ్డి రాజ్యం పురుడుపోసుకుంది. ఈ ముగ్గురు ఇలా స్వతంత్ర రాజులుగా ప్రకటించుకోవడం తో, కోపోద్రిక్తుడైన సుల్తాన్ మూడు రాజ్యలపై ఒకే సమయం లో దండేతెందుకు వీలుగా మూడు సేనలను ఒకేసారి సిద్దం చేశాడు. అయితే సైన్యం తక్కువగా వున్న గొరిల్లా యుద్ద కలలో ఆయితెరిన ప్రోలయ వేమారెడ్డి, తమ్ముడు మల్లారెడ్డి సహాయంతో తురుష్కం  సైన్యాన్ని అంతమొందించగలిగాడు.            ...

అలెగ్జాండ్రోవిచ్

అలెగ్జాండ్రోవిచ్               ఆ ఒక్కడే లేకపోతే మూడో ప్రపంచయుద్ధమే...! ఒక్కోసారి దూకుడుగా తీసుకునే నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలని చెబుతారు. ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రపంచ భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యే ప్రమాదముందని అనడానికి రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఓ ఘటనే ఉదాహరణ.....!            రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో అమెరికా తటస్థంగా ఉండి పోయింది. కానీ చివర్లో ఇంగ్లాండ్, సోవియట్ యూనియన్... తదితర దేశాలతో కలిసి అక్షకూటమి పై పోరాడింది. 1945 లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య దూరం పెరిగింది. ఈ రెండు దేశాల మధ్య ప్రచన్న యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో అమెరికా సమీపంలో వున్న క్యుభా పై పట్టు సాధించాలని రెండు అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తూ వుండేవి. అయితే క్యూబా కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉండేది.            అది 1962 అక్టోబర్ 27... సోవియట్ యూనియన్ కు చెందిన బి - 29 జలాంతర్గామి క్యుబాకు సమీపంలోకి వెళ్ళింది...

గౌతమి పుత్ర శాతకర్ణి

గౌతమి పుత్ర శాతకర్ణి భారతదేశాన్ని పాలించిన రాజుల్లో అతి గొప్పరాజు ఎవరు అంటే సాధారణంగా ఓ అశోకుడు,అక్బరో, ఓ శివజనో లేదంటే ఓ శ్రీకృష్ణదేవరాలు గుర్తుకు వస్తారు.                అయితే విజయాల్లోను, సామ్రాజ్య విస్తరణలో పాలన దక్షతలోను, పౌరుషం లోనూ దేనిలోనూ ఎవరు సాటి రాలేని ఓ భారతీయ పరిపాలకుడు వున్నాడు. ఈ విశాల భారతావనిలో అతనితో సరితూగగల రాజులేవరు లేరంటే అతశయోక్తి కాదు. అయితే అచ్ఛ తెలుగు చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి.               భారత దేశాన్ని పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యం లోని గొప్ప రాజుల్లో శాతకర్ణి అగ్రగణ్యుడు. శాతవాహన సామ్రాజ్యం ఎక్కడ వుండేది. ప్రస్తుత భౌగోళిక స్వరూపం ప్రకారం చెప్పాలంటే పక్షిమ డెక్కన్ ప్రాంతం అంటే తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర, మరియు ఆంధ్రప్రదేశ్ లో శాతవాహన సామ్రాజ్యం విస్తరించి వుండేది.               శాతవాహనుల మొదటి తరం పాలకులందరూ మహారాష్ట్ర లోని ప్రతిష్ఠను పురాన్ని రాజధానిగా చేసుకుంటే ఆ తరువాత వచ్చిన పాలకులు ఆంధ్ర ప్రాంతం లోని అమరావతిని రాజధానిగా చేస...